Breaking : రాగల 48 గంటల్లో బంగాలాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

-

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇది ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మిగతా చోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే మూడు రోజుల పాటు ఇంకా తెలంగాణలో వర్షాలకు కురుస్తాయని.. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version