హీరో గోపీచంద్ ఏ సినిమాకి మొదటి పారితోషికం అందుకున్నారో తెలుసా..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీల పిల్లల విషయానికి వస్తే ఈ విషయం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్రతారలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వారు కూడా ఇండస్ట్రీలోకి ఆసక్తితోనే అడుగు పెట్టారు. కానీ ఇండస్ట్రీ లోకి రావడం ఇష్టం లేకపోయినా.. వారసుడు ఎవరో ఒకరు ఉండాలి అన్న కారణంతో ఒక హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అన్న విషయం బహుశా చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఇక అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. నిజానికీ ఈయనకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇష్టం లేదు. ప్రముఖ దర్శకుడు టీ.కృష్ణ వారసుడిగా ఆయన పెద్దకొడుకు ప్రేమ్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు. రెండు సినిమాలకు పని చేసిన తర్వాత ఆయన మరణించడం జరిగింది.

ఇండస్ట్రీలో తన వారసుడు ఉండాలి అని ఆలోచించిన టి.కృష్ణ గోపీచంద్ కు ఇష్టం లేకపోయినా సరే.. తొలివలపు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇకపోతే తొలివలపు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని చెప్పాలి . ఇక ఆ తర్వాత జయం, వర్షం, నిజం వంటి సినిమాలలో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల పక్కా కమర్షియల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తున్న ఈయన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ , టీజర్ , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పాల్గొని తన మొదటి పారితోషికం గురించి వెల్లడించారు. తొలివలపు సినిమాకు తనకు ఎలాంటి పారితోషకం అందలేదని.. జయం సినిమాలో విలన్ గా నటించినందుకు కేవలం రూ.11వేల రూపాయలను మాత్రమే పారితోషికంగా ఇచ్చారు అని గోపిచంద్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version