శ్రీశైలంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. మరో వివాదం !

-

శ్రీశైలంలో నేటి నుంచి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు  యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 17 వరకు శాశ్వత ఆర్జిత హోమాలైన రుద్రహోమం మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం,స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంతసేవలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన యదావిదిగా కొనసాగించనున్నారు.

ఇదిల ఉంటే మరోపక్క శ్రీశైలంలో మరో వివాదం చెలరేగింది. శ్రీశైలంలో మరో సారి అన్యమతస్తుల వివాదం రాజుకుంది. దీంతో దేవ స్థానం పరిపాలన భవం వద్ద స్పెషల్ పార్టీ పోలీసులతో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావును పలు డిమాండ్లతో కలిసిన హైందవ సంఘాలు, శ్రీశైలంలో అన్యమతస్తుల పెత్తనం ఎక్కువైంది శ్రీశైలం నుంచి రజాక్ రఫీని  వెళ్లగొట్టాలని  హైందవ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. రజాక్ భార్య అయిన సూపరింటెండెంట్ సాయికుమారిని శ్రీశైలం నుంచి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version