BREAKING : అమరావతిలో హై టెన్షన్..నేతలపై లాఠీ ఛార్జి

-

అమరావతిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేల మధ్య బహిరంగ చర్చకు సంబంధించి జరుగుతున్న వివాదం ప్రస్తుతం పోలీసులకు ఆందోళన కలిగిస్తుంది. అమరావతి ప్రాంతంలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటు చేసినప్పటికీ ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అమరావతి చేరుకున్నారని స్పష్టమైన సమాచారం అందుతుంది.

ప్రమాణం చేయడానికి పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మాటల సవాళ్లు విసురుకున్నారు. ఈ ప్రమాణానానికి అతు వైసీపీ ఇటు టీడీపీ ల నుండి కార్యకర్తలు భారీగా తరలి వస్తుండడం గమనించిన అమరావతి పోలీసులు గొడవలు జరుగుతాయని ముందే ఊహించి ఈ రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ ను అమలులో పెట్టారు. ఈ తరుణంలోనే… ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠిచార్జి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version