అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఓటేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. గంటగంటలకు పోలింగ్ శాతం ఎక్కువవుతోంది. ఉదయం 11 గంటలకు 33 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 45.63 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 61.66 శాతం ఉన్న పోలింగ్ పర్సెంటేజీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 76.26 శాతానికి చేరింది. మరో రెండు గంటలు ఉండటంతో మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. గంట గంటకు పది శాతం పోలింగ్ పెరుగుతుంది. దీంతో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో 2018 ముందస్తు ఎలక్షన్ సమయంలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది.
హుజూరాబాద్ పోల్ అప్డేట్: సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్ శాతం. మిగిలింది మరో రెండు గంటలే..
-