నేను ఆ మాట అనలేదు – రేవంత్ రెడ్డి

-

తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ కు అమ్ముడుపోయారని టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో సంచలనంగా మారాయి. మా పార్టీలో చాలామంది పెద్ద రెడ్లు కెసిఆర్ కు అమ్ముడుపోయారని, అందుకే కొత్త తరానికి అవకాశం వచ్చి.. తాను పిసిసి చీఫ్ అయ్యానని వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి పార్టీలో దుమారం కావడంతో ఆ వ్యాఖ్యలపై స్పందించారు రేవంత్ రెడ్డి.

పార్టీ సీనియర్ నేతలు అమ్ముడుపోయారనే వ్యాఖ్యలు తాను చేయలేదని వెల్లడించారు. తన మాటలను ఓ పత్రిక వక్రీకరించి రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనని మాటలు కూడా అన్నట్లు మీడియా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జటిలం చేయవద్దని కోరారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version