అధికారుల తీరు చూస్తుంటే వైసీపీకి కొమ్ముకాస్తున్నట్టు ఉంది… కూటమి అభ్యర్థుల ఆందోళన

-

పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ,కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు.విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…అధికారులు అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

ఈనెల 16న ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్‌, ఎంపీపీ మామిడి అప్పల నాయుడు ఆధ్వర్యలో పోస్టల్‌ బ్యాలెట్‌లను తరలించడంపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని అన్నారు.పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో తరలించడంపై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు.అధికారుల తీరు చూస్తుంటే వైసీపీకి కొమ్ముకాస్తున్నట్టు ఉందని తెలిపారు. ఆ రోజే ఈ విషయం మీడియా ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యేకి ఉన్న వ్యవహరాలు రోజూ మీడియాలో చూస్తున్నామన్నారు. అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version