HCA యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి – దాసోజు శ్రవణ్

-

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు బిజెపి నేత దాసోజు శ్రవణ్. ఇది పూర్తిగా హెచ్సీఏ, ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. హెచ్సీఏ యాజమాన్యంపై, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నేడు జింఖానా గ్రౌండ్స్ నుంచి నిరాశతో వెనుదిరిగారు లేడీ ఫ్యాన్స్. ఉదయం నుంచి టికెట్ల కోసం వెయిట్ చేసిన లేడీ ఫ్యాన్స్.. టికెట్లు లేవు అని, తిరిగి వెళ్ళిపోవాలని పోలీసులు కోరారు.

దీంతో లేడీ ఫ్యాన్స్ టికెట్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రుక్తత నెలకొనడంతో గ్రౌండ్స్ కి భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. టికెట్స్ అయిపోవడంతో మళ్ళీ గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు మోహరిస్తున్నారు. టికెట్స్ ఉన్నంతవరకు ఇస్తారు.. అయిపోయిన తర్వాత సహకరించాలని అంటున్నారు ఐపీఎస్ అధికారి చౌహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version