ఇండియా కరోనా : 90 లక్షలు దాటేశాయ్

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కో రోజు కేసులు, మరణాలు బాగా తగ్గుతోంటే మళ్ళీ వెంటనే పెరుగుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఈ రోజు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 491 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,807గా ఉంది.

corona

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,43,794గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,28,410కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,32,162కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,83,397 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 12,95,91,786 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువ కావడం ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version