ఇండియా కొత్తగా 15,823 కరోనా కేసులు : 96 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ !

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు 20 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 15 వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 15,823 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,01,743 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,07,653 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 226 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,51,189 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 22,844 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,33,42,901 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 50,63,845 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 96,43,79,212 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version