ఇండియాలో కొత్తగా 13,058 కరోనా కేసులు..227 రోజుల తర్వాత ఇదే మొదటి సారి!

-

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా తగ్గుతున్నాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,058 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,94,373 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,83,118 కు చేరింది. అయితే.. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 227 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 378 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,52,454 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,34,58,801 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 98,67,69,411 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version