మన సైనికులను పాక్ చంపుతుంటే.. పాక్ తో మోదీ క్రికెట్ ఆడుతున్నారు.- అసదుద్దీన్ ఓవైసీ

-

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మరోమారు కేంద్రం తీరుపై ఫైరయ్యారు. మన సైనికులను పాకిస్తాన్ చంపుతుంటే మోడీ పాక్ తో క్రికెట్ ఆడుతున్నాడంటూ విమర్శించారు. హిందువులతో ముస్లీం యువతులు తిరిగితే దాడులు చేయడానికి మీరెవరని ముస్లిం యువకులు చేస్తున్న దాడులపై నిలదీశారు. హిందు యువకుడు, ముస్లిం యువతిని కొట్టి సోషల్ మీడియాలో అవమానించడం దారుణమన్నారు. మరోవైపు హిందూ యువతులు, ముస్లింలతో తిరిగితే సంతోషపడుతున్నారని ఇది సరైనది కాదని చురకలు అంటించారు. మన కుటుంబాల్లో మార్పు రావాలన్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రంపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో యోగీని ఓడించి తీరుతామని చెప్పారు. చైనా సైనికులు దేశంలోకి చొరబడుతుంటే మోడీ మౌనంగా ఉంటున్నారని, చైనాను చూసి మోడీ భయపడుతున్నారని విమర్శించారు. కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడుతుంటే అమిత్ షా ఏం చేస్తున్నారు.? భారీ స్థాయిల కాశ్మీర్లోకి ఆయుధాలు ఎలా వస్తున్నాయి..?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version