ఇజ్రాయెల్‌-గాజా ఘర్షణల్లో పౌరులను రక్షించాల్సిన అవసరం ఉంది.. మోదీ-సునాక్‌ ఫోన్‌ చర్చలు

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య యుద్ధం ఎంతో మంది సామాన్య పౌరుల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఐక్య రాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాలకు మద్దతు పలుకుతున్న దేశాలు కూడా పౌరులపై దాడులను ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యం ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై తాజాగా బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ శుక్రవారం రోజునప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌-గాజా ఘర్షణల్లో పౌరుల రక్షించాల్సిన అవసరం ఉందని.. పశ్చిమాసియాలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను ఇరు దేశాల అధినేతలు ముక్త కంఠంతో ఖండించినట్లు తెలిసింది.

మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా మోదీ-సునాక్ మాట్లాడినట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతిని కూడా సమీక్షించారని వెల్లడించారు. ప్రపంచ కప్‌ క్రికెట్‌లో భారత టీమ్‌ సాధిస్తున్న విజయాలను రిషి సునాక్ అభినందిస్తూ మోదీకి కంగ్రాట్స్ తెలిపారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version