ఐపీఎల్ 2023: ముంబై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కంఫర్మ్… !

-

ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ల మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో మొదట టాస్ గెలిచిన ముంబై వారికి బాగా కలిసొచ్చిన ఛేజింగ్ ను ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ అస్సలు ఇంతవరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. నిలకడ లేమితో వరుస ఓటములతో ఉన్న ముంబై జట్టును సూర్య కుమార్ తనదైన బ్యాటింగ్ తో ఇప్పుడు ప్లే ఆఫ్ కు ఇంచ్ దూరంలో నిలిపాడు. ఈ మ్యాచ్ లో కనుక గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ బెర్త్ ను కంఫర్మ్ చేసుకుంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ గెలిస్తే మొత్తం 16 పాయింట్ లతో గుజరాత్ తర్వాత స్థానంలో నిలుస్తుంది. ఇక అదే సమయంలో లక్నో కూడా ప్రస్తుతం ముంబై తర్వాత స్థానంలో నిలిచి ఉంది.

ఈ మ్యాచ్ లో కనుక గెలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్లు సాధిస్తుంది… ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి ఇంకో అడుగు దూరంలో నిలుస్తుంది.. ఒకవేళ ఓడిందా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు అవుతాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version