IPL 2024 : చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్ ..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి ఓవర్లోనే అత్యధిక వికెట్లు(26*) తీసిన బౌలర్గా నిలిచారు. తొలి ఓవర్లో 5వ బంతికి రోహిత్ శర్మ ని ఔట్ చేసి బౌల్ట్ ఈ ఫీట్ సాధించారు. దీంతో భువనేశ్వర్కుమార్ పేరిట ఉన్న రికార్డు(25వికెట్లు) చెరిగిపోయింది. ఇదిలా ఉంటే T20ల్లో హిట్మ్యాన్ను బౌల్ట్ 6సార్లు ఔట్ చేశారు.

కాగా, ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ లో ఓపెనర్స్ హిట్ మ్యాన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 6 పరుగులు చేయగా ఇషాన్ కిసాన్ డక్ అవుట్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా పది పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 43 పరుగులు, వదేర 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version