అకీరా నందన్ వెళ్ళిపోతున్నారా? రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినీ ప్రేక్షకులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఆయన అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా రాజకీయాలలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ప్రచారం చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన రెండో భార్య రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచుతురాలు.. పలు సినిమాలలో ఆమె కూడా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత వారి పిల్లలైనా అకీరానందన్, ఆద్యకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గర నుండి రేణు దేశాయ్ చూసుకుంటుంది.

ఈ క్రమంలోనే అకీరా నందన్ ను ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దింది. ఇదివరకే ప్లస్ 2 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. అంతేకాదు అకిరా నందన్ మంచి పియానో ప్లేయర్ , బాక్సర్ కూడా. సాంగులకు పియానో అద్భుతంగా వహించి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు ఇదిలా ఉండగా అఖీరానందన్ కు సంబంధించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది రేణు దేశాయ్.. ఇకపోతే సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేసే ఈ ముగ్గురు ఇప్పటివరకు స్కాట్లాండ్లో బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోని రేణు దేశాయ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

రేణూ దేశాయ్.. రెక్కలు వచ్చిన పక్షులు తమ గూడుని వదిలి ఎలా వెళ్లిపోతాయో.. అలా అకీరా కూడా ఇప్పుడు కాలేజీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్.. ఇకపోతే అకీరా నందన్ ఉన్నత చదువుల కోసం కాలేజీ కి వెళుతున్నట్లు సమాచారం. ఇకపోతే అకీరా నందన్ పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అకిరా నందన్ ఎప్పుడు సినీ ఇండస్ట్రీలోకిడుగు పెడతాడని ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version