సమంత వల్లే ఆ హీరోయిన్ ఎదగలేకపోయిందా..?

-

సమంత రుతుప్రభ.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే తన నటనతో, అమాయకత్వంతో, చిలిపిచేస్టలతో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సమంత ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అక్కినేని వారి అబ్బాయి నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత అక్కినేని కోడలుగా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది సమంత. కానీ నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత గొడవలు పడి విడాకులు తీసుకున్న వీరు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా సమంత వల్ల ఒక హీరోయిన్ ఎదగలేక పోయింది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అంటే ఎక్కువ ప్రాధాన్యత మొదటి హీరోయిన్ కే లభిస్తుంది. అందుకే సెకండ్ హీరోయిన్ గా నటించడానికి చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్గా నటిస్తే మాత్రం వారి కెరియర్ కూడా అంతంతమాత్రంగానే మారిపోతుంది. ఇక అలాంటి వారిలో దివ్యాన్ష కౌశిక్ కూడా ఒకరు. సమంత వివాహం తర్వాత మొదటిసారి తన భర్తతో కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో తన అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను మెప్పించినప్పటికీ..క్రెడిట్ మొత్తం సమంతాకే దక్కింది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినందుకుగాను తన కెరియర్ లో దివ్యాన్ష కౌశిక్ ఎదగలేక పోయింది అనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇటీవల ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక కనీసం ఈ సినిమాతో నైనా ఈమె క్రేజ్ పెరుగుతుందో లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version