వాసవి గ్రూప్‌ సంస్థపై ఐటీ దాడులు..

-

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఐటీ దాడులు సాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. వాసవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో 40కి పైగా ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు.

వాసవి గ్రూపు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, డైరెక్టర్ల ఇళ్లలో, సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తోంది. ఈ సంస్థ తమకు వస్తున్న ఆదాయానికి, ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. వాస్తవ ఆదాయం చూపడం లేదన్న ఆరోపణలపై ఐటీ సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన విలువైన పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version