దాని కోసం టాబ్లెట్స్ వేసుకున్నా – జాన్వి కపూర్

-

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది.

హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన మూవీ ‘మిలీ’ నవంబర్ 4 న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా జాన్వి పలు విషయాలు పంచుకుంది. ‘ఈ మూవీలో పాత్ర కోసం 7.5 కేజీల బరువు పెరిగా. ఈ సినిమా విషయంలో శారీరకంగానే కాదు, మానసికంగా ఇబ్బంది పడ్డా. నేను పోషించిన పాత్రకు సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి. సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజులు పెయిన్ కిల్లర్స్ వాడా’ అని జాన్వి చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version