అంతర్వేది ఘటనపై రంగంలోకి దిగిన జగన్…!

-

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై సిఎం జగన్ రంగంలోకి దిగారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Jagan

ఇక అక్కడ భారీగా భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతర్వేది గ్రామంలోకి కూడా ఎవరిని రానీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాలని రామచంద్రమోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. కొత్త రథం నిర్మాణం సహా పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని సూచనలు చేసింది. కాగా ఇటీవల జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version