సామాన్యుడికి, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం ఇది – సీఎం జగన్‌

-

సామాన్యుడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబును ఇద్దేశించి సీఎం జగన్‌ విమర్శలు చేశారు. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని… వచ్చే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు మరింత పెరుగుతాయని ఆగ్రహించారు. మీడియాని కాదు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకోండని కోరారు. మీకు మంచి జరిగితే నాకు మద్దతుగా నిలబడండన్నారు సీఎం జగన్‌.

దత్త తండ్రి చెబితే..దత్త పుత్రుడు చెప్పులు చూపిస్తున్నాడని పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబులకు సీఎం జగన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. వీళ్లు బూతులు తిట్టడంలో ఏ స్థాయికి వెళ్ళారో చూస్తున్నామని.. టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తుంటే వీళ్ళా నాయకులు అని బాధేస్తుందని ఆగ్రహించారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నాడో చూస్తున్నామని.. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మనం ఆలోచిస్తుంటే.. కొంత మంది మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version