కుప్పంలో భరత్ ను గెలిపించండి…మంత్రి ఇస్తా – సీఎం జగన్‌

-

కుప్పం నియోజక వర్గంప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. కుప్పంలో భరత్ ను గెలిపించండి…మంత్రి ఇస్తానని ప్రకటన చేశారు సీఎం జగన్‌. మంత్రిగా భరత్‌ కుప్పాన్ని మరింత అభివృద్ధిని చేస్తాడు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆరు నెలలు పూర్తిచేసి నేను వచ్చి ప్రారంభిస్తానన్నారు జగన్.

ఇవాళ కుప్పం నియోజక వర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నిధులు విడుదల చేశామని తెలిపారు. కుప్పంలో బిసిలు పోటీ చేయాల్సిన సీటు అని… బిసిల సీటును లాక్కుని చంద్రబాబు పోటి చేస్తున్నాడని ఆగ్రహించారు సీఎం జగన్‌. ఇలాంటి వ్యక్తి బిసిలకు న్యాయం చేస్తామని అంటాడన్నారు.

36 సంవత్సరాలలో కుప్పం సీటును ఒక్కసారి అయినా బిసిలకు ఇచ్చారా…అని నిలదీశారు. కుప్పం మీదా చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమా మాత్రమేనని ఎద్దేవా చేశారు. జాబ్ రావాలంటే బాబు రావాలంటాడు…కుప్పం నుండి రోజు ఐదు వేల మంది నిత్యం పక్క రాష్టాలకు వెళుతుంటారని చురకలు అంటించారు. కుప్పం నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. 26,39,703 మందికి వైఎస్సార్‌ చేయూత అందిస్తున్నామని ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version