మీ మద్దతుకు…మరోసారి మీ జగన్‌ సెల్యూట్ – జగన్ ట్వీట్

-

నిన్న, మొన్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు లక్షల్లో జనాలు వచ్చారు. అయితే.. సమావేశాలపై సీఎం జగన్ తాజాగా ట్వీట్‌ చేశారు. మీ మద్దతుకు…మరోసారి మీ జగన్‌ సెల్యూట్ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

“నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు… ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో… చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు… మీ జగన్‌ సెల్యూట్, మరోసారి!” అంటూ సీఎం జగన్‌ వెల్లడించారు.

కాగా.. నిన్నటి వైసిపి ప్లీనరీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు కాలేవని సెటైర్లు పేల్చారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version