మరోసారి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. వారికి లేఖ

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్, చైర్మన్‌లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ప్రాముఖ్యత ఇవ్వాలని అడిగారు. ఈ నేపధ్యం లో ఆయన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీలను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులను ప్రోత్సహిస్తూనే.. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్న నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.

నియోజకవర్గల వారీగా ఫైనల్ చేసిన అభ్యర్థుల జబితాను టిపిసిసి స్టీల్ కవర్ లో స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. 26 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థిని ఎంపిక చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, మరికొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున పేర్లను ఈ జాబితాలో సిఫార్సు చేసినట్లు సమాచారం. ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్ని స్థానాలకు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలనే దానిపైన ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారాం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version