ఇలా చేస్తే.. టీఆర్ఎస్ పార్టీలో చేరుతా: జగ్గారెడ్డి

-

జర్నలిస్టుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని సంచలన ప్రకటన చేశారు. ఇళ్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేఖిస్తూ నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని.. కేవలం నియోజకవర్గ అభివ్రుద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎదురుపడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

jaggareddy | జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్యమంలో పని చేసిన జర్నలిస్టులకు హైదరాబాద్ లో ఇళ్లు, ఫ్లాట్లు, కార్లు ఇప్పిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని.. నేను చేసిన డిమాండ్లకు అనుకూలంగా ప్రభుత్వం స్పందిస్తే టీఆర్ఎస్ లో చేరుతా అని ఆయన అన్నారు. తెలంగాణలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఒకసారి నా పదవిని త్యాగం చేస్తా అని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుపడిన సమయంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version