ముగిసిన జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు.. పాడె మోసిన సిద్దూ, స్పీకర్లు

-

ఆదివారం తెల్లవారు ఝామున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మరణించిన విషయం విదితమే. సోమవారం జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Jaipal Reddy Last Rites

కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యుడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

కన్నీటి పర్యంతమైన కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్

జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన రమేశ్‌కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version