మంత్రి అవంతి శ్రీనివాస్‌కు షాకిచ్చిన జ‌న‌సేన‌..

-

ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ నేతలు ఏపీ మంత్రికి షాక్ ఇచ్చింది. తాజాగా భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు.

ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version