రేటు పెంచిన జాతిరత్నం..?

-

ఒక్క హిట్టు చాలు సినీ పరిశ్రమలో తామేంటో ప్రూవ్ చేసుకోడానికి.. అలాంటి హిట్టు కొట్టి తన సత్తా చాటుతున్న వారిలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఒకరు. ఐదారేళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన నవీన్ ఏజెంట్ ఆత్రేయ సినిమాతో మెప్పించాడు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన జాతిరత్నాలు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నవీన్ రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. పదును పెడితే కుర్రాడిలో స్టార్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించారు. అందుకే ఓ బడా నిర్మాణ సంస్థ నవీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందట.

ఇక క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో నవీన్ పొలిశెట్టి కూడా తన రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్. ప్రస్తుతం సినిమాకు 5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట నవీన్ పొలిశెట్టి. రెండంటే రెండే సినిమాలతో ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న నవీన్ 5 కోట్ల పారితోషికం అడుగుతూ షాక్ ఇస్తున్నాడని తెలుస్తుంది. తన రానున్న సినిమాల్లో కంటెంట్ మీద కూడాద్ దృష్టి పెడుతున్నాడట నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా సినిమా వస్తుందని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version