2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారింది – జోగి రమేష్

-

2022 వ సంవత్సరం చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందని ఎద్దేవా చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు అందరికీ ఈ ఏడాది బూతుల నామ సంవత్సరం అయింది అన్నారు. గడిచిన ఈ ఏడాది పేద వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం అని.. చంద్రబాబుకు మాత్రం ఏడుపు మిగిల్చిన సంవత్సరంగా అభివర్ణించారు. పేదవారికి విద్యా, వైద్య, ఆరోగ్యపరంగా విజయనమ సంవత్సరం అన్నారు జోగి రమేష్.

jogi ramesh

ఇక వచ్చే సంవత్సరం మరిన్ని మెరుగైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు. 2023 లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు పచ్చి బూతులు ఎలా తిట్టాలని ట్రైనింగ్ అయ్యే సంవత్సరంగా మారిపోతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు దమ్ముంటే 175 నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులను నిలబెట్టాలని.. పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్ ని స్వీకరించాలన్నారు. కందుకూరులో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version