జర్నలిస్టు ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

-

క్రిమి సంహారక మందు తాగి ఓ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొమురం భీం జిల్లాలోని వాంకిడి మండల పరిధిలోని శిరిడీ గ్రామంలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లూరి సురేష్ (42) ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.ఈ క్రమంలోనే గురువారం రాత్రి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అది గమనించిన కుటుంబ సభ్యులు సురేష్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ద్విచక్రవాహనంపై ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే,అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు పంపించారు.ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. కాగా, సురేష్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version