జగిత్యాలలో పాముకాటుతో మహిళా రైతు కూలీ మృతి

-

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాము‌కాటుకు గురై ఓ మహిళా రైతు కూలీ మృతి చెందినది. ఈ విషాద ఘటన జిల్లాలోని కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి(30) మహిళ రైతు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.రోజు వారీ లాగే గురువారం వ్యవసాయ పనుల కోసం మక్క చేనులో కోతకు వెళ్లింది.

ఈ క్రమంలోనే చేనులో పనిచేస్తుండగా లక్ష్మిని పాము కాటు వేసింది.వెంటనే తోటి కూలీలు ఆమెను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతిచెందింది. లక్ష్మికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. అందరికీ కూలీ పని చేస్తూ..చేదోడువాదోడుగా ఉండే లక్ష్మి మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలి ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version