జూలై 1 న హైదరాబాద్ కు జేపీ నడ్డా

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. బేటికి సారథ్యం వహించనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల 1న ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డా కు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిల భేటీలో.. కార్యవర్గ సమావేశాల ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకుంటారు.

జూలై 2న ఉదయం పదాదికారుల సమావేశం, సాయంత్రం 4 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. జూలై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉంటుంది. కాగా తుది సన్నాహాలు పై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్ కు రానున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూలై 2 న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. అక్కడి నుండి రాజ్ భవన్ కు గాని లేదా నేరుగా నోవాటెల్ కు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version