రిహాన్నా ఒక మూర్ఖురాలు.. కంగ‌నా ర‌నౌత్ ట్వీట్‌..!

-

ఢిల్లీలో రైతులు చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహాన్నా మ‌ద్దతు తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేసింది. మాజీ ఇంగ్లండ్ క్రికెట‌ర్ మాంటీ ప‌నేస‌ర్ నిర్వ‌హించిన ఓ టాక్‌షోలో పాల్గొన్న రిహాన్నాను అత‌ను భార‌త్‌లో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌న‌ల‌పై స్పందించ‌మ‌ని కోరాడు. దీంతో ఆమె రైతు ఉద్య‌మానికి మ‌ద్దతు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అస‌లు ఈ విషయం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు, ఎందుకు ? అని రిహాన్నా ట్వీట్ చేసింది.

అయితే రిహాన్నా చేసిన ట్వీట్‌కు స‌పోర్ట్‌గా ప‌లువురు సెల‌బ్రిటీలు స్పందించగా బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ మాత్రం రిహాన్నాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఢిల్లీలో రైతుల ఉద్య‌మం గురించి ఎవ‌రూ మాట్లాడడం లేదు, అవును, ఎందుకంటే అక్క‌డ ఉద్య‌మం చేస్తున్న‌ది రైతులు కాదు, టెర్ర‌రిస్టులు, క‌నుక‌నే ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు, అమెరికాలో చైనా కాల‌నీ ఎలాగైతే ఉందో భార‌త్‌ను కూడా అలాగే విభ‌జించి చైనాకు అప్ప‌గించాల‌ని ఆ టెర్రరిస్టులు చూస్తున్నారు, అలా జ‌ర‌గ‌నీయం, నువ్వు ముందు కూర్చో, మూర్ఖురాలా, మీ లాగా మా దేశాన్ని మేము అమ్ముకోం.. అంటూ కంగ‌నా ట్వీట్ చేసింది.

అయితే దీనిపై నెటిజన్లు కూడా భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు రిహాన్నాకు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌గా, కొంద‌రు మాత్రం నీకు మా దేశం గురించి ఎందుకు, నీ ప‌ని నువ్వు చూసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ‌రోవైపు ఢిల్లీలోకి రైతులు ఎవ‌రూ ప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు గాను ర‌హ‌దారుల‌పై ఇప్ప‌టికే కాంక్రీట్ గోడ‌ల‌ను, ఇనుప చువ్వ‌ల‌ను ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ 40 ల‌క్ష‌ల ట్రాక్ట‌ర్ల‌తో ఈ సారి ఇంకా భారీ ఎత్తున ఉద్య‌మం చేస్తామ‌ని రైతులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version