కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్ దే అధికారం: కర్ణాటక మంత్రి

-

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ కు మరియు ఆ పార్టీ నేతలకు గుండెల్లో ఉడుకుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో ప్రచారంలో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇక తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక మంత్రి జోశ్యం చెప్పారు. కాంగ్రెస్ నేత మరియు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ మంచి ఊపుమీద ఉంది, ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఎక్కువగా దానికే ఉన్నాయంటూ జోస్యం చెప్పడం విశేషం. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉంటూ వచ్చిన కేసీఆర్ కు ఈసారి ప్రతిపక్షము స్థానం తప్పదన్న అర్థంలో గుండూరావు చెప్పడం గులాభీ గుండెల్లో గుబులు రేపుతోంది.

మరి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అటుంచితే డిసెంబర్ 3న రానున్న ఫలితాలు తేల్చనున్నాయి. అప్పటి వరకు అన్ని పార్టీలు మరియు నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version