‘కార్తీకేయ-2’ నుంచి మరో అప్‌డేట్..నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ఎగ్జైటెడ్

-

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తీకేయ’ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘కార్తీకేయ-2’ వచ్చే నెల 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను వినూత్నంగా అనౌన్స్ చేశారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా టీజర్ ప్రకటన హీరో, హీరోయిన్ నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ఇచ్చేశారు. సోమవారం సాయంత్రం టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాము ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు హీరో, హీరోయిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా, డెఫినెట్ గా సినిమా విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version