ఈడీ విచారణలో కవిత ఆమె నిజాయితీని నిరూపించుకోవాలి – డీకే అరుణ

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవని చెప్పారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్లు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

లిక్కర్ స్కాం లో ఇప్పటికే అరెస్టు అయిన వారు పదేపదే కవిత పేరును ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఈడీ విచారణలో కవిత ఆమె నిజాయితీని నిరూపించుకోవచ్చని సూచించారు. కెసిఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం అలవాటైందని విమర్శించారు. కవితను ఈడీ విచారణకు పిలిస్తే మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడి నుండి నోటీసులు వస్తాయని కవితకు ముందే సమాచారం ఉండటం వల్ల మహిళా రిజర్వేషన్లు అనే కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version