అవినీతికి కేసీఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్లు : టీపీసీసీ అధికార ప్రతినిధి

-

కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కార్ రేసింగ్ వరకు అన్నింటిలో కేసీఆర్ అవినీతి బయట పడ్డదని టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అవినీతే జరగలేదని హరీష్ రావు ,జగదీశ్ రెడ్డి సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .

కేసీఆర్ చెప్పితేనే చేశామని స్వయానా అప్పటి అధికారులే విచారణలో చెప్పారని తెలిపారు . ఏ తప్పు చెయ్యనప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని, వాయిదాలు ఎందుకు కోరుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరూ భాగస్వాములేనని ఆరోపించారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను ప్రజలు నిలదీస్తరని, కానీ కేసీఆర్ చేసిన అవినీతిని వెలికి తీసేవరకు వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు .అవినీతికి కేసీఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్లని మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Exit mobile version