సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త..

-

సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త. బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కంటి వెలుగు వైద్య శిభిరాన్ని ప్రారంభించారు తెలంగాణ సి.ఎస్. శాంతి కుమారి. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిభిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రారంభించారు.

సోమవారం నుండి పది రోజుల వరకు ఈ ప్రత్యేక వైద్య శిభిరాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version