విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

-

ఏపీ రాజకీయంలో హాట్ టాపికైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని అన్నారు.ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్‌పై పూర్తి స్పష్టత వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక, జగన్ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నాశమనైందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వివరించారని తెలిపారు. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. గతంలో జగన్ కేంద్ర నిధుల్ని పక్క దారి పట్టించాడని ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version