జనసేన హై కమాండ్ కీలక నిర్ణయం… ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పనున్న నాదెండ్ల

-

జనసేన ఎమ్మెల్యేలు ఈ నెల 25వ తేదీన భేటీ కానున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జనసేన హై కమాండ్ నిర్ణయించింది.

శాసన సభ నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలపై ,సభలో ఏ విధంగా వ్యవహరించాలన్న వివిధ అంశాలను కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్‌లు చెప్పనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆఫీస్‌లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించనున్నారు అని తెలుస్తోంది.గతంలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version