చంద్రబాబు ప్రచార పిచ్చితో 8 మంది చనిపోయారు: కొడాలి నాని

-

చంద్రబాబు ప్రచార పిచ్చితో 8 మంది చనిపోయారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సభలు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించడం పై వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు.

ఇరుకు సందుల్లో సభలు పెట్టవద్దని నాయకులు చెప్పిన వినకుండా పబ్లిసిటీ స్టాండ్ కోసం కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించాడు అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఫలితంగా నేను మంది అమాయకులు మరణించారని ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబు అంటూ విమర్శలు చేశారు. డ్రోన్ షాట్ ల కోసం అందరిని ఒకవైపు నిలబెట్టడం వల్లే తోపులాట జరిగిందని నిప్పులు చెరిగారు కొడాలి నాని. దీనిపై విచారణ జరిపిస్తామని కూడా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version