చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.2013 తర్వాత దాదాపు 12 ఏళ్లకు భారత జట్టు రోహిత్ శర్మ సారధ్యంలో చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే, మ్యాచ్ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ట్రోఫీని ముద్దాడారు. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. షమీ తన తల్లిని పరిచయం చేయగా.. ముందుగా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
షమీ తల్లి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ
భారత పాస్ట్ బౌలర్ మహ్మద్షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ జట్టు గెలిచింది. అనంతరం విరాట్ నేరుగా షమీ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో… pic.twitter.com/bOxctx6wx7
— ChotaNews App (@ChotaNewsApp) March 10, 2025