ఎంపీ కోమటిరెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

-

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సమక్షంలోనే ఎంపీ కోమటిరెడ్డి పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అవుతున్నాయి. పార్టీలో అందరం కలిసి పని చేయలేక ఓడిపోయామని, పార్టీకి నష్టం చేసేవాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి ని సస్పెండ్ చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం గాంధీభవన్ లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వ్యక్తిగత అంశాలు మాట్లాడవద్దని కోరారు. ఏదైనా ఉంటే ఇన్చార్జిని కలవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version