వివేకా కేసులో A1 జగనే..అందుకే షర్మిల, విజయమ్మ హైదరాబాద్ పారిపోయారు : కూనరవికుమార్

-

శ్రీకాకుళం జిల్లా : వివేకా కేసులో A1 జగనేనని.. అందుకే షర్మిల, విజయమ్మ హైదరాబాద్ పారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. వైసిపి అధినేత హస్తం లేకుండా కుటుంబంలో హత్య సాద్యం అవుతుందా.. జగన్ చెప్పాలన్నారు. గొడ్డలి వేటుని .. గుండె పోటు గా ఏలా మార్చాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఏంక్వైరీ డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చాక ఏందుకు ఏంక్వైరీ వద్దని పిటిషన్ వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు.

వివేక హత్యలో సూత్రదారులేవరు, పాత్రదారులేవరో.. జగన్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివేకా కుతురే .. సొంత కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సజ్జల స్వయంగా సునీత తో మాట్లాడారు అని ఆమె ఆరోపిస్తున్నారని ఆగ్రహించారు. సునీత రెడ్డి వాంగ్మూలం బట్టి కేసులో జగన్ ప్రమేయం ఉందా? సునీత రెడ్డి తనకి ప్రాణ హాని ఉందంటున్నారు… హాని చేసే అవకాశం ఏవరికి ఉందో.. ప్రజలకు తెలుసు అన్నారు. నాడు అధికారంలోకి రావడానికి కోడి కత్తి డ్రామా అని.. సునీత రెడ్డి బర్తే ఆరోపించారని మండిపడ్డారు. మీ రక్తం మరకలను…. చంద్రబాబు కి, టిడిపి అంటించాలనుకున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version