కేటీఆర్‌ భుజంపై చేయివేసిన నిజాం స్టూడెంట్‌.. ఫోటో వైరల్‌

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిన్న.. నిజాం కాలేజీకి వెళ్లారు. ఈ సందర్భంగా నిజాం కాలేజీ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా… డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పథకాలు అలాగే పట్టాలను మంత్రి కేటీఆర్ ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగారు మంత్రి కేటీఆర్.

ఈ నేపథ్యంలోనే నిజాం కాలేజీ వేదికగా ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. అది ఏంటంటే… నిజాం కాలేజీకి చెందిన ఓ విద్యార్థి మంత్రి కేటీఆర్ పై చేయి వేసి… సెల్ఫీ దిగారు. డిగ్రీ పట్టా పొందిన ఆ విద్యార్థి… మంత్రి కేటీఆర్ చేతులమీదుగా తన పట్టా అందుకుని.. అనంతరం ఆయన తో ఫోటో దిగాడు.

తన మిత్రులతో సెల్ఫీ దిగిన విధంగానే.. మంత్రి కేటీఆర్ తో చాలా చనువుగా ఆ విద్యార్థి ఫోటో దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఓ సాధారణ వ్యక్తిగా కేటీఆర్‌.. విద్యార్థితో ఫోటో దిగడం గర్వకారణమని.. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ… ఇదే ఓ నాయకుడి మంచి లక్షణమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version