రాజ్ గోపాల్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి… ఉపఎన్నికలకు రావాలి – మునుగోడు మాజీ ఎమ్మెల్యే

-

కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఛాలెంజ్‌ విసిరారు మునుగోడు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ గోపాల్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి… ఉపఎన్నికలకు రావాలని సవాల్‌ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉంటున్నారో అతనికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.

ఆరు నెలల కోసారి కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టని ఏకైక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డిని సాగనంపేందుకే మునుగోడు ప్రజలు సిద్ధమయ్యారని చురకలు అంటించారు.

మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్దంగా ఉందని.. స్వార్థం కోసం నమ్మిన పార్టీని, ప్రజలను మోసం చేసిన నీచ బుద్ధి రాజ్ గోపాల్ రెడ్డిదని మండిపడ్డారు. ఓ క్షణం ఎన్నికలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్ట్ 7 వ తేదీ తర్వాత బీజేపీ లో చేరతారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version