టీచర్ పై అత్యాచారం.. వీడియో తీసి బయట పెడుతానంటు బెదిరింపు

-

ఎన్ని చట్టాలు చేసిన.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి మరొకరి జీవితాలను చీకట్లోకి నెట్టుతున్నారు. తాజాగా మరో దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. షాజహన్ పూర్ కు చెందిన 28 ఏళ్ల అమిర్ అనే వ్యక్తి స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ ను ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడు. ఒకటే గ్రామానికి చెందిన వారు కావడంతో పలు మార్లు హెచ్చరించింది. ఈ క్రమంలో గత మే 4 న టీచర్ ను బైక్ పైన ఎక్కాలని అమిర్ కోరాడు. తెలిసిన వాడే కదా.. అని ఆమె ఎక్కింది.

ఆ తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగగానే ఆమె మత్తులోనికి జారుకుంది. అతను ఇంట్లో తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత… మతం మారి పెళ్లి చేసుకొవాలని బెదిరింపులకు దిగాడు. అత్యాచారం చేసిన వీడియో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితుని తల్లి, సోదరి, సోదరుడు, సమీప బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version