ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకులు ఇంకోక పార్టీకి మారొద్దు – ఈటెల రాజేందర్

-

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 20 ఏళ్లు పార్టీతోనే ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన భూ కబ్జాల ఆరోపణ వల్ల టిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలోకి వెళ్లారు . బిజెపిలోకి వెళ్లిన తర్వాత బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ లాంటి కీలక బాధ్యతలు అధిష్టానం ఆయనకు అప్పగించింది. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పార్టీ మార్పుల గురించి ఈటల స్పందించారు.

ఆయనకు గౌరవం, స్థాయి, స్థానం,బంధం, అనుబంధం ఈ పార్టీలో ఉండేది అన్నారు. ఒక ‘పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకులు ఇంకొక పార్టీకి మారొద్దు నా అనుభవంతో చెబుతున్న’అని అన్నారు.ఒక పార్టీలోకి మారినప్పుడు మనకు అక్కడ దొరికిన గౌరవం దొరకాలంటే.. అక్కడ ఉన్న పొజిషన్ దొరకాలంటే అది సాధ్యమయ్యే పని కాదు’ అని అన్నారు. ఆయన పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version