ఏపీకి క్రైమ్ క్యాపిటల్ గా నెల్లూరు – నారా లోకేష్‌ సెటైర్లు

-

తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి అని యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యడు. అయితే.. ఈ సంఘటనపై టీడీపీ నేత నారా లోకేష్‌ స్పందించారు.

జగన్ రెడ్డి గారి మూడు రాజధానులకి తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నెల్లూరుని ప్రకటించినట్టు ఉంది దుస్థితి. పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైరవిహారం చేస్తున్నాడు. నెల్లూరు సిటీ టిడిపి ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడం దారుణం. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version