శ్రీవారి సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారు – జగన్ పై లోకేష్‌ ఫైర్‌

-

శ్రీవారి సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్‌ అయ్యారు. తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో దెబ్బతీస్తోంది వైసీపీ ప్రభుత్వమని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారు… భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏకంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదంటూ టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేసాడని మండిపడ్డారు. టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. టీటీడీ సిబ్బంది పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version